అనుమానస్పద స్థితిలో కోతులు మృత్యువాత..

వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి సమీపంలో హృదయాలను

Update: 2024-10-25 09:06 GMT

దిశ, వేములవాడ : వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి సమీపంలో హృదయాలను కదిలించే విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం శాంతి నగర్ సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో సుమారు 50 కోతులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అదే సమయంలో మృత్యువాత పడిన కోతులు కుప్పలుకుప్పలుగా ఒకే దగ్గర పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

సదరు కోతులు ఏమైనా విష పూరిత ఆహారం తిన్నాయా లేదా ఎవరైనా ఎక్కడైనా మరణించిన కోతులను ఇక్కడకి తీసుకువచ్చి వేశారా అనేది తెలియడం లేదు. ఏది ఏమైనా పదుల సంఖ్యలో కోతులు ఒక్కసారిగా మృత్యువాత పడటం పట్ల స్థానికులతో పాటు సమాచారం తెలిసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ కోతుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై అధికారులు స్పందించి నిజానిజాలను తేల్చాలని, నిజంగా మానవ ప్రమేయం ఉంటే వారిని బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్టానికులతో పాటు హిందూ సంఘాల నాయకులు కోరుతున్నారు.


Similar News