శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫుడ్ పాయిజన్

నగరంలోని మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.

Update: 2024-06-30 13:53 GMT

దిశ, కరీంనగర్ టౌన్ : నగరంలోని మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆదివారం ఉదయం విద్యార్థులు తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ కావడంతో స్పందించిన కళాశాల యజమాన్యం విద్యార్థులను వెంటనే స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై కలెక్టర్ చొరవచూపి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

Similar News