ఒకే స్కూల్​ నుంచి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక

శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

Update: 2024-07-04 11:59 GMT

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను పదవ తరగతిలో సాధించడంతో బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చిట్టా జ్యోతి తెలిపారు. ఎంపికైన విద్యార్థులలో తాళ్ల నిఖిల, ముష్కే కావ్య, సుంక సంజన,గట్టు స్పందన, రెడ్డి శ్రీనిధి, కల్లేపల్లి సంతోష్ కుమార్ ఉన్నట్లు తెలిపారు. 


Similar News