CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డీజీ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డీజీ భేటీ అయ్యారు.

Update: 2024-08-22 12:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని ఈ సందర్భంగా జాక్వెలిన్ కు సీఎం సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలన్నారు. ఇక్రిశాట్ ను సందర్శించాలని సీఎం ను జాక్వెలిన్ కోరగా తప్పక సందర్శిస్తానని రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Tags:    

Similar News