హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జవహర్ నగర్!

హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం జవహర్ నగర్లో పర్యటించారు.

Update: 2024-09-04 13:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ బుధవారం జవహర్ నగర్లో పర్యటించారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ కు అనుమతులు లేవని గుర్తించారు. అలాగే అంబేద్కర్ నగర్లో ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా ఆక్రమణకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఫామ్ హౌస్ కు అనుమతులు జారీ చేసిన అధికారులపై, చెరువు ఆక్రమణలపై అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోనున్నట్టు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేద వారిపై కాస్త జాలి చూపిస్తామేమో గాని... ఆక్రమణలు చేసి కట్టిన బడా బాబుల ఫామ్ హౌసులను, నిర్మాణాలను నోటీసులు లేకుండానే కూల్చి వేస్తామని రంగనాథ్ హెచ్చరించారు. అయితే పేదల పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కాగా హైడ్రా కమిషనర్ తన బృందంతో జవహర్ నగర్లో పర్యటించడంపై.. ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అక్కడే అని నగర్ ప్రజలు చర్చించుకుంటున్నారు.     


Similar News