హైదరాబాదులో మరో రెండు దారుణ హత్యలు.. భయాందోళనలో నగర ప్రజలు

హైదరాబాదులో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-06-29 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదులో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నగరంలో మరో రెండు హత్యలు జరిగాయి. చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణంగా చంపబడ్డాడు. రెయిన్ బజార్‌కు చెందిన రౌడీ షీటర్ నజాబ్‌ను అర్ధరాత్రి మలక్‌పెట్ మెట్రో స్టేషన్ వద్ద హోటల్ సవేరా ముందు.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో పొడిచి చంపేశారు. అలాగే జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర నగర్‌లో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న 40 ఏళ్ల అనిల్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. రోజురోజుకు భయం భీతి లేకుండా వ్యవహరిస్తోన్న దుండగులను కఠినంగా శిక్షించాలని పలువురు హైదరాబాదు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News