గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసుల బందోబస్తు..

నిరుద్యోగ డిమాండ్ల సాధన కోసం ఓయూ విద్యార్థి నాయకుడు మోతిలాల్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Update: 2024-07-01 12:37 GMT

దిశ, సికింద్రాబాద్ : నిరుద్యోగ డిమాండ్ల సాధన కోసం ఓయూ విద్యార్థి నాయకుడు మోతిలాల్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడు రోజులుగా మోతిలాల్ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. మోతిలాల్ పరామర్శించేందుకు గాంధీకి వస్తున్న పలువురు నాయకులను పోలీసులు గేటు బయటనే అడ్డుకొని అరెస్టు చేస్తున్నారు.

మోతిలాల్ పరామర్శించి మద్దతు తెలిపేందుకు వచ్చిన నాయకులు బక్కా జడ్సన్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బక్కా జడ్సన్ మాట్లాడుతూ మోతిలాల్ కు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. నిరుద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Similar News