రైతు బజార్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా

కొత్తపేటలోని రైతు బజార్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతానని మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబిత ఇంద్రారెడ్డి అన్నారు.

Update: 2024-07-03 14:44 GMT

దిశ, చైతన్య పురి : కొత్తపేటలోని రైతు బజార్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతానని మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబిత ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం కొత్తపేటలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతు బజార్ ను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రామ్ నర్సింహా గౌడ్​లో కలిసి పరిశీలించారు. రైతు బజార్

     లోని వ్యాపారాస్తులు, వినియోగదారులు, రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ త్వరలో మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి చిలుక నర్సింహా రెడ్డి, రైతు బజార్ కార్యదర్శి స్రవంతి రెడ్డి, స్వరూప రెడ్డి, మహమ్మద్ ఖాన్, డీఈ రవీందర్, భారాస పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, రైతు బజార్ సిబ్బంది, రైతులు, వ్యాపారాలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


Similar News