మియాపూర్ 100, 101లలో నిర్మాణదారులకు నోటీసులు

హెచ్ ఎండీఏ అధికారులు ఎట్టకేలకు మేలుకున్నారు. ఇన్నాళ్లు నిద్రావస్థలో ఉన్న అధికారులు మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో నిర్మాణాలు చేపట్టినా మిన్నకుండి చూస్తూ ఉన్నారు.

Update: 2024-06-29 10:03 GMT

దిశ, శేరిలింగంపల్లి : హెచ్ ఎండీఏ అధికారులు ఎట్టకేలకు మేలుకున్నారు. ఇన్నాళ్లు నిద్రావస్థలో ఉన్న అధికారులు మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో నిర్మాణాలు చేపట్టినా మిన్నకుండి చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వేలాదిమంది తరలివచ్చి ఆభూముల ఆక్రమణలకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల మీద దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆఘమేఘాల మీద సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న భూముల చుట్టూ కంచె వేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇన్నాళ్లు

     ఆక్రమణలకు పాల్పడి, అక్కడ నిర్మాణాలు సాగించిన వారికి గత రెండు మూడు రోజులుగా నోటీసులు ఇస్తున్నారు. పై రెండు సర్వే నెంబర్లు హెచ్ఎండీఏకు సంబంధించినవని, అందులో నిర్మాణాలు సాగించిన వారు అక్కడి నుండి ఖాళీ చేయాలని హెచ్ ఎండీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో చాలాకాలంగా అక్కడే ఉంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము లక్షలు వెచ్చించి కొనుగోలు చేశామని, ఇప్పుడు హెచ్ఎండీఏ అధికారులు ఖాళీ చేసి వెల్లమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

Similar News