గోల్కొండ బోనాల్లో పల్లవి ప్రశాంత్ సందడి..

గోల్కొండ బోనాల్లో భాగంగా ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ సందడి చేశారు.

Update: 2024-07-08 16:17 GMT

దిశ, మెహిదీపట్నం : గోల్కొండ బోనాల్లో భాగంగా ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ సందడి చేశారు. గోల్కొండ జగదాంబిక ఆలయ వృత్తిపని వారల సంఘం అధ్యక్షుడు బొమ్మల సాయిబాబా చారి, సంఘం నేత శ్రీకాంత్ చారి ఇంటి వద్ద నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాంత్ చారితో పాటు స్థానిక యువకులతో కలిసి పల్లవి ప్రశాంత్ డాన్స్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు.

ఓపెన్ టాప్ జీప్ పై శ్రీకాంతచారితో కలిసి కొద్దిసేపు ప్రయాణించి హంగామ చేశారు. పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్తాల్సిన బాధ్యత యువత పై ఉందన్నారు. యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మల సాయిబాబా చారి, సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు.


Similar News