Goa Trains : సికింద్రాబాద్ టు గోవా ఇక షురూ.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గోవా వెళ్లే తెలంగాణ పర్యాటకులకు కొత్తగా రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Update: 2024-10-06 10:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గోవా వెళ్లే తెలంగాణ పర్యాటకులకు కొత్తగా రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ టు గోవా వెళ్లే రైలును ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సౌత్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ రైళ్ల సేవలు రెగ్యులర్ సర్వీస్‌లు సికింద్రబాద్ నుంచి ఈనెల 9న, వాస్కోడగామా నుంచి 10న షురూ కానున్నాయి.

సికింద్రాబాద్ -వాస్కోడగామా (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో, వాస్కోడగామా- సికింద్రాబాద్ (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో బయలుదేరుతాయి. కాగా ప్రస్తుతం ఈ మార్గంలో రెగ్యులర్ సర్వీసు (17603) నడుస్తోంది. ఇది మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రైలు సేవలు పర్యాటకులకు మరింత మెరుగైన అవకాశాలను పెంచనున్నాయి.


Similar News