అనారోగ్య కారణాలతో వ్యక్తి ఆత్మహత్య

Update: 2024-10-06 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో కుటుంబ పోషణ భారమై మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మీరుదొడ్డి కుమార్ (41) అను వ్యక్తి శనివారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని భార్య మంజుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


Similar News