వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి.

Update: 2024-09-05 14:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ సంస్థలు తమ గొప్ప మనసును చాటుకుంటున్నాయి. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఒకరోజు మూల వేతనాన్ని వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. అన్నిస్థాయిల ఉద్యోగులు, పెన్షనర్ల ఒకరోజు మూలవేతనం మొత్తం రూ.15 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా కంపెనీ కూడా రూ.5 కోట్లు విరాళంగా అందించింది. తెలంగాణ ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.5 కోట్లు ప్రకటించారు. ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీ తెలంగాణకు రూ.కోటి, ఏపీకి రూ .కోటి విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది.    


Similar News