తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్

అనేక ఆందోళనల అనంతరం తొలిరోజు టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

Update: 2024-10-21 12:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : అనేక ఆందోళనల అనంతరం తొలిరోజు టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 46 పరీక్షా కేంద్రాల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ లో భాగంగా తొలిరోజు ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేసిన అనంతరం ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. కొన్ని చోట్ల కొద్ది నిముషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు కంటతడి పెట్టినప్పటికీ.. వారిని లోపలికి వదలలేదు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. భారీగా పోలీసు బందోబస్తు, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల కట్టుదిట్టమైన భద్రత నడుమ అభ్యర్థులు మొదటి పరీక్షను ప్రశాంతంగా రాశారు. నిర్దేశిత సమయం ముగిసిన తర్వాతనే అభ్యర్థులను తిరిగి బయటికి వదిలారు. 


Similar News