ఆర్య వైశ్య కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు ఇవ్వండి: చైర్ పర్సన్ కాల్వ సుజాత

రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్య వైశ్య కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు పెట్టాలని ఆ కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత గుప్తా ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2024-07-23 17:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్య వైశ్య కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు పెట్టాలని ఆ కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్‌లో మంగళవారం డిప్యూటీ సీఎంను ప్రత్యేకంగా కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కాల్వ సుజాత మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులకూ ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఆర్య వైశ్య సామాజిక వర్గంలో పేదలు ఉన్నారని, అలాంటి కుటుంబాలకు ఆర్ధికంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీంతో పాటు విద్యా, వైద్యంకూ పెద్ద పీఠ వేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు. ఇక కార్పొరేషన్ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు సచివాలయంలో నోడల్ డిపార్ట్ మెంట్‌ను కేటాయించాలన్నారు.


Similar News