CM రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2024-08-03 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదని ప్రతిపక్షాలపై పంజా పాలన అన్నారు. బడ్జెట్ సమావేశాలను బుల్ డోజ్ సమావేశాలుగా ముఖ్యమంత్రి మార్చారన్నారు. అసెంబ్లీలో ఆరు రోజుల్లో ఒక్క రోజే ప్రశ్నోత్తరాలకే అవకాశం ఇచ్చారని తెలిపారు. జీరో హవర్ ప్రస్తావన లేకుండా పోయిందన్నారు. కేవలం రెండు రోజుల్లోనే పద్దులపై చర్చ పూర్తి చేశారన్నారు. సమస్యల గురించి ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని సీరియస్ అయ్యారు. నిరసన తెలిపితే మార్షల్స్‌తో సభ నుంచి బయటకు పంపించారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులే అబద్ధాలు మాట్లాడుతున్నారనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు.  

Tags:    

Similar News