CP Mahanthi: పరిస్థితి చేయిదాటకూడదనే అలా.. కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఇష్యూపై సీపీ అవినాశ్ మహంతి

కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఇష్యూపై సీపీ అవినాశ్ మహంతి స్పందించారు.

Update: 2024-09-13 13:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణల్లో వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు అయినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. శుక్రవారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మహంతి.. కౌశిక్ ఇంట్లోకి గాంధీని వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించామని, కార్యకర్తలు పోలీసులపై తిరగబడి ఇంట్లోకి చొరబడ్డారని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్, మీడియా వద్ద ఉన్న వీడియో ఫుటేజ్ లను సేకరించి పరిశీలిస్తామన్నారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకే ఇవాళ నేతలను హౌజ్ అరెస్టు చేశామన్నారు. 


Similar News