తెలంగాణ పోలీసులకు సీఎం భారీ గుడ్ న్యూస్

తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.

Update: 2024-10-21 05:42 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారంగా అందిస్తామని ప్రకటించారు. గోషామహల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన సీఎం.. ఈ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కు కోటి రూపాయలు, ఎస్సై, సీఐలు వీరమరణం పొందితే రూ.1.25 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలు వీరమరణం పొందితే రూ.1.50 కోట్లు, ఐపీఎస్ లు మరణిస్తే.. పరిహారంగా వారి కుటుంబాలకు రూ.2 కోట్లు ప్రభుత్వం ఇస్తుందని సీఎం తెలిపారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. శాశ్వతంగా అంగవైకల్యం పొందిన అధికారుల ర్యాంకును బట్టి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు. 


Similar News