కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం
కామారెడ్డి జిల్లా పుల్కల్, హాజ్గుల్ శివారులో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది.
దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లా పుల్కల్, హాజ్గుల్ శివారులో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఒక్క సారిగా చిరుత కనిపించడంతో రైతులు పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు రైతులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. చిరుత సంచరిస్తుందని తెలియడంతో స్థానికులు వణికిపోతున్నారు. చిరుత సంచారంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, రైతులకు అటవీ శాఖ అధికారులు సూచించారు.