ఏఎంవీఐ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి.. 112 మంది హాజరు
రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ కాబోతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల్లో కొత్త అభ్యర్థులు చేరనున్నారు. ఇందుకోసం సోమవారం రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహించారు. 113 మంది అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా ఎంపిక కాగా వారి సర్టిఫికెట్లను జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 112 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారి వివరాలను సంబంధిత శాఖలకు పంపించి పూర్తి వివరాలు తెలుసుకుని.. అంతా ఓకే అయితేనే వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఖాళీగా ఉన్న ఏఎంవీఐ పోస్టులు భర్తీ కానుండటంతో అదనపు పని భారంతో సతమతమవుతున్న ఉద్యోగులకు కాస్త రిలీప్ దక్కనుంది.