బీఎస్పీ పార్టీకి పద్మశాలిల మద్దతు కోరిన బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Update: 2023-10-11 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఎస్పీ పార్టీకి పద్మశాలిలు మద్దతు కావాలని బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో పద్మశాలిలకు బీఎస్పీ 8-10 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని, ఇప్పటికే ఒక అభ్యర్థిని ప్రకటించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇప్పటికే పలు పార్టీలు జాబితా ప్రకటించిన.. అందులో పద్మశాలిలకు ఒక్క స్థానంలో కూడా ఇవ్వలేదని, మిగిలిన పార్టీలు కూడా అదే దోరణి ప్రదర్శించే అవకాశాలు కనబతున్నయన్నారు.

కాబట్టి రానున్న ఎన్నికల్లో బీసీల పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు తెలుపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగడ్ల స్వామి, రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ రావు, బీఎస్పీ నాయకులు పేండం ధనుంజయ్ నేత, బండారి సదానందం, కర్నాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News