మా అమ్మ మళ్లీ చనిపోయింది.. పంపించేసి వస్తా: రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

తన ఒక్కగానొక్క కూతురు ఆకస్మిక మరణం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను తీవ్రంగా కలిచివేసింది.

Update: 2024-10-07 12:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : తన ఒక్కగానొక్క కూతురు ఆకస్మిక మరణం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను తీవ్రంగా కలిచివేసింది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. కూతురు మరణం నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించేందుకు ఇండస్ట్రీ నుంచి పలువురు నటులు ఆయన ఇంటికి వెళ్ళారు. అలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ ను నిన్న కలసిన సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది..పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో చూసిన వారంతా ఆయనకు సానూభూతిని చెబుతున్నారు.

ఓ సినిమా ఈవెంట్ లో తన కూతురు గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. నా పదేళ్ల వయసులోనే మా అమ్మ గారు చనిపోయారని, దీంతో నా కూతురిలోనే అమ్మను చూసుకున్నానన్నారు. కానీ ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని, ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవని, ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించానని రాజేంద్రప్రసాద్ చెప్పడం ఆయనకు కూతురు పట్ల ఉన్న ప్రేమను చాటింది. తన కామెడితో ప్రేక్షకులను నవ్వించే ఆయన ఇప్పుడు అమ్మలాంటి కన్న కూతురు గుండెపోటుతో చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.


Similar News