BRS: కాంగ్రెస్ రైతు ద్రోహి అనడానికి ఇదొక రుజువు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి ఎగ్గొట్టి వెన్ను విరిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-10-21 06:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి ఎగ్గొట్టి వెన్ను విరిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. "ఖరీఫ్ భరోసా బోల్తా" అని ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. రైతుబంధు కావాలా? రాబందు కావాలా? అని, ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా? అని అడిగారు. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందని, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..! అని ఎద్దేవా చేశారు. ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి.. ఉన్న పదివేలు ఊడగొట్టారని ఆరోపించారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమేనని చెప్పారు. రైతు ద్రోహి కాంగ్రెస్ అనడానికి చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని.. ఇప్పుడు ఇంకొకటి కూడా బయటపడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 


Similar News