స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసిన BRS ఎమ్మెల్యేలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు.
దిశ, వెబ్డెస్క్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. స్పీకర్ను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. అధికారుల వ్యవహార శైలిని సభాపతి దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెచ్చారు. కాగా, పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు సమయంలో గైర్హాజరు కావడం సంచలనంగా మారింది. పార్టీ మార్పు ప్రచారం వేళ ఈ పరిణామం ఉత్కంఠ రేపుతోంది.