ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

Update: 2024-10-24 15:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షుడిగా, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు సభ్యులుగా.. కె. కేశవరావు స్పెషల్ ఇన్వైటీగా ఉండనున్నారు. దీపావళి తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతుందని తెలియ జేశారు. కాగా గురువారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పెండింగ్ డీఏలపై శుక్రవారం సాయంత్రం లోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలుపుతుందని సీఎం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.


Similar News