కేంద్ర టెక్స్ టైల్ సంప్రదింపుల కమిటీలో ఎంపీ చామల

కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియామకమయ్యారు. ఈ కమిటీ కి కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ చైర్మన్ గా ఉంటారు.

Update: 2024-10-24 16:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియామకమయ్యారు. ఈ కమిటీ కి కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ చైర్మన్ గా ఉంటారు. లోక్ సభ నుంచి ఎనిమిది మంది, రాజ్యసభ నుంచి నలుగురు ఎంపీలతో పాటు ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 14 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుండి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ కి చోటు కల్పించడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి నియమితులయ్యారు. ఈ కమిటీ కి కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చైర్మన్ గా ఉంటారు. దీనిలో లోక్ సభ నుంచి ఏడుగురు మంది, రాజ్యసభ నుండి ఏడుగురు ఎంపీలతో పాటు ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 16 మంది తో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సెంట్రల్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, కడియం కావ్య లకు చోటు దక్కింది.


Similar News