'గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శం'

Update: 2023-07-14 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శమని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను కలిశారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చోటు లభించడం హర్షణీయం అని అన్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణ లోనే కాకుండా దేశ విదేశాలలో విస్తరించిందని తెలిపారు.

ఎంపీ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, చాలా మంది రాజకీయ నాయకులు సంక్షేమం, అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెడతారన్నారు. అన్ని బాధ్యతల కన్నా సామాజిక బాధ్యత మిన్న అన్నారు. సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమని పేర్కొన్నారు. కేసీఆర్ పేరు భవిష్యత్ తరాలకు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సమిష్టి కృషి, సామాజిక స్పృహకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమన్నారు.


Similar News