రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా రేపు బీజేపీ రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపు

రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Update: 2024-09-11 16:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో జరిగిన ఓ ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతూ.. 'భారతదేశం న్యాయమైన దేశంగా మారినపుడే రిజర్వేషన్ల తొలగింపు గురించి ఆలోచించాలి, ప్రస్తుతం భారతదేశంలో న్యాయం లేదు..' అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా భారత్ ను అవమానించేలా మాట్లాడుతున్నాడాని, అది ఎంత మాత్రం మంచిది కాదని పలువురు బీజేపీ అగ్ర నేతలు రాహుల్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. రాహుల్ వ్యాఖ్యలపై నిరసనగా రాష్ట్ర బీజేపీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నాయకులు. ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తలందరూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.  


Similar News