VH: తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వీహెచ్ కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడటం తీవ్రమైన విషయని, ఆ వ్యవహారంపై వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Update: 2024-09-20 09:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడటం తీవ్రమైన విషయని, ఆ వ్యవహారంపై వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐ ఎంక్వైరీ (CBI Enquiry)కి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఇంత పాపానికి ఒడిగడుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని భగవంతుడు కూడా క్షమించడని, ఇప్పటికే ఆ విషయంలో కొన్ని సంఘటన ద్వారా తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దేశ ప్రధాని (Prime Minister)తో పాటు కేంద్ర హోంమంత్రి (Central Home Minister) కూడా కలుగజేసుకుని వెంటనే సీబీఐ (CBI) విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.    


Similar News