రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు వీసీల నియామకం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న యూనివర్సిటీల వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-18 10:06 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న  యూనివర్సిటీల వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 9 యూనివర్సిటీలు ఉండగా..

1. పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్

2. కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి

3. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్

4. శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్

5. హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నిత్యానందరావు

6. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్

7. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొ.యాదగిరిరావు

8. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

9. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ రాజి రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


Similar News