మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక నేపథ్యంలో తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Update: 2022-08-21 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక నేపథ్యంలో తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమిత్ షాకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మహంకాళి ఆలయం నుంచి నేరుగా బన్సీలాల్ పేట డివిజన్‌లోని దళిత కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శిస్తారని సమాచారం. అమిత్ షా తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News