పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి

రానున్న స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి బీజేపీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని ఎంపీ నగేష్ అన్నారు.

Update: 2024-09-20 13:54 GMT

దిశ,గుడిహత్నూర్ : రానున్న స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి బీజేపీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని ఎంపీ నగేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని శివ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలన్నారు.

    రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యువతదే భవిష్యత్తు అని అన్నారు. అధిక సంఖ్యలో యువతకు పార్టీ సభ్యత్వం ఇవ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగె బ్రహ్మానంద్, బద్ధం లింగారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ మయూర్ చంద్ర, మండల అధ్యక్షులు కేంద్రే శివ, నాయకులు కేంద్రే లక్ష్మణ్, చాటే సంబాజీ, వాగ్మారే శైలేందర్, బోడకే జగన్, లక్ష్మీకాంత్ , జునుగురు మహేష్ పాల్గొన్నారు.  

Tags:    

Similar News