వెనుకబడిన విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాలు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుక బడిన విద్యార్థులను ముందుకు తీసుకు వచ్చేందుకు ఏఐ ద్వారా ప్రత్యేక వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Update: 2025-03-15 13:01 GMT

దిశ,ఆదిలాబాద్ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుక బడిన విద్యార్థులను ముందుకు తీసుకు వచ్చేందుకు ఏఐ ద్వారా ప్రత్యేక వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రోగ్రాంను తాటిగూడ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో ప్రారంభించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం వారు చదువులో ముందుండటానికి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని, అందులో భాగంగానే మొదట 6 జిల్లాల్లో ఏఐ ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించిందన్నారు.

    అక్కడ విజయవంతం కావటంతో మిగిలిన 27 జిల్లాల్లో ఈనెల 15 నుండి నాలుగు ప్రైమరీ పాఠశాలల్లో ప్రారంభించినట్టు తెలిపారు. 3,4,5 తరగతుల విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఈకే స్టెఫ్​ అనే ఆర్గనైజేషన్ తో కలిసి ఏ ఎక్స్ఎల్ అనే ఏఐ ఆధారిత వెబ్సైట్ ద్వారా విద్యార్ధులకు బోధించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్ధుల చదువుపట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజూ పాఠశాలకు పంపించాలని సూచించారు. ఏఐ ద్వారా భాషలలో, గణితంలో వెనుకబడిన విద్యార్థులను తక్కువ సమయంలో సి-గ్రేడ్ నుండి ఏ-గ్రేడ్ కు మార్చవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ, కోర్సు ట్రైనీ, ఎంఈఓ మనోహర్, ఏఎస్ఓ శ్రీకాంత్, ట్రైనీ గణేష్ పాల్గొన్నారు. 


Similar News