బీఆర్ఎస్ కు ఆదిలాబాద్ లో మరో బిగ్ షాక్..

Update: 2024-08-30 14:18 GMT

దిశ, ఆదిలాబాద్ః ఆదిలాబాద్ లో గులాబీ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు ఆ పార్టీని వదిలి శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ముగ్గురు కౌన్సిలర్లు సంజయ్, వార్డు నెంబర్ (20), 6వ వార్డు కౌన్సిలర్ నెమలికొండ విషు, 40 వార్డు కౌన్సిలర్ భరత్ కుమార్ లు బీజేపీలో చేరగా వారికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కండువా వేసి ఆహ్వానించారు. బీ ఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పెరిగిన జనాధరణతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరినట్టు కౌన్సిలర్లు తెలిపారు. పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తామన్నారు. వీరి వెంట 150 మంది కార్యకర్తలు బిజెపి కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో పట్టణ, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News