ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు

Update: 2024-08-13 06:52 GMT

దిశ, వేమనపల్లిః మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. డిస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పాఠశాలలో రికార్డులు, బిల్లులు, స్టాక్, సానిటేషన్, విద్యార్థుల హాజరును, వంట సామాగ్రి తదితర అంశాలపై వివరాలను తెలుసుకున్నారు. అలాగే టీచర్ల పనితీరుపై కూడా ఆరా తీశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలున్నాయో అడిగి తెలుసుకున్నారు. 

Tags:    

Similar News