హాస్టల్ నుండి 4 గురు విద్యార్థుల మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు

నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం (ఎస్సీడీడీ)లో

Update: 2024-10-22 06:59 GMT

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం (ఎస్సీడీడీ)లో చరణ్,రాకేష్,కేశవ్,ఈశ్వర్ అనే 4గురు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకోగా, ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా బిడ్డలు ఎక్కడికెళ్లారంటూ వార్డెన్,వాచ్మెన్ ప్రశ్నిస్తున్నారు..? విద్యార్థులు మిస్సింగ్ అన్న విషయం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో హాస్టల్ వార్డెన్,వాచ్ మెన్ నిర్లక్ష్యం వహించారంటూ పేరెంట్స్ వాపోతున్నారు.

విద్యార్థుల మధ్య నిన్న రాత్రి గొడవ జరిగినట్లు అక్కడి మరో విద్యార్థి పేర్కొన్నారు. ఎప్పటిలాగే రోజు పొద్దున పిల్లలకు పాలు అందించే క్రమంలో వాచ్మెన్ గమనించడంతో ఈ ఘటన బయటకు వచ్చిందని వాచ్మెన్ పేర్కొన్నారు. సంఘటన స్థలానికి పట్టణ సీఐ గోపీనాథ్ చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడి, హాస్టల్ వార్డెన్ వాచ్మెన్ ద్వారా మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. పిల్లలు ఆచూకీ కోసం పోలీసుల చర్యలు ప్రారంభించారు.


Similar News