అస్వస్థతకు గురైన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-10-21 11:43 GMT

దిశ, ఆసిఫాబాద్: జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో..నిర్వహించిన అమరవీరుల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరులను సర్మించుకొని వారి ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిస్తున్న క్రమంలో కలెక్టర్ అస్వస్థతకు గురికావడంతో.. తన సహాయకుడు వెంటనే స్పందించి కలెక్టర్ ను పట్టుకున్నాడు. పండ్ల రసం తాగిన కలెక్టర్ కాసేపు కుర్చీలో సేద తీరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.


Similar News