బైంసాలో దంచి కొట్టిన వాన...

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో సోమవారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది.

Update: 2024-10-21 12:46 GMT

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో సోమవారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. భైంసాలో వారాంతపు సంత సోమవారం కాగా, ముధోల్ తాలూకా పలు గ్రామాల నుండి, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూరగాయల వ్యాపారులు రాగా వారి దుకాణ సముదాయాలు కాస్త వరద నీటితో ముద్దయిపోయాయి. మార్కెట్ గంజ్ యార్డులో కొద్ది పాటి సోయా సైతం వరద నీటితో ముద్దయిపోయింది. చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలు చిందర వందరగా మారాయి. దాదాపు గంటపాటు భారీ వర్షం నమోదు అయింది.


Similar News