తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాయుగుండం ముప్పు

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది.

Update: 2024-09-05 17:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమయి కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిషా, బెంగాల్ తీరానికి చేరుకోనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు ఒడిషా, బెంగాల్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ.. ఏపీ, తెలంగాణలో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. 


Similar News