వాల్మీకి కార్పొరేషన్ అక్రమాస్తుల కేసు.. ఏక కాలంలో 18 చోట్ల కొనసాగుతున్న ఈడీ రైడ్స్

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల సంచలనంగా మారిన వాల్మీకి కార్పొరేషన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అధికారులు దూకుడు ప్రవర్తిస్తున్నారు.

Update: 2024-07-10 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల సంచలనంగా మారిన వాల్మీకి కార్పొరేషన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అధికారులు దూకుడు ప్రవర్తిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఏకకాలంలో 18 చోట్ల రైడ్స్ కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి బీ. నాగేంద్ర, ఎమ్మెల్యే బసనగౌడ ఇళ్లలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు బి. నాగేంద్ర, బసనగౌడ దద్దల్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ రైడ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News