సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ స్కూల్లో తనిఖీలు

దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్(CRPF) స్కూల్స్ కి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-22 10:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్(CRPF) స్కూల్స్ కి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లలో భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో సికింద్రాబాద్ లోని జవహర్ నగర్లోని సీఆర్పీఎఫ్ స్కూల్లో కూడా బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెదిరింపు మెయిల్ విషయం తెలియగానే ముందుగా స్కూల్లోని పిల్లలని క్షేమంగా ఇళ్లకు తరలించిన పోలీసులు.. అనంతరం స్కూల్లో ప్రతీ గదిలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కాగా స్కూల్ వద్దకు చేరుకున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీపీ మహేష్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News