150 మందికి పైగా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

డిజిటల్ క్రాఫ్ సర్వే ను వ్యతిరేకిస్తున్న ఏఈవో లను ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల పేరుతో తన దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

Update: 2024-10-22 12:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : డిజిటల్ క్రాఫ్ సర్వే ను వ్యతిరేకిస్తున్న ఏఈవో లను ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల పేరుతో తన దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా 150 మందికి పైగా ఏఈవో లపై సస్పెన్షన్ వేటు వేసినట్లుగా సమాచారం. యూనియన్లు పెట్టినా, ప్రభుత్వం చెప్పిన పని చేయడానికి నిరాకరించిన వేటు తప్పదంటూ ప్రభుత్వం తన చర్యల ద్వారా హెచ్చరించింది. డిజిటల్ క్రాఫ్ సర్వే చేయకపోతే ఉద్యోగాలు ఉండవన్న తీరుగా ప్రభుత్వం చర్యలున్నాయని ఏఈవోలు మండిపడుతున్నారు. అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లపై ప్రభుత్వం వేధింపులను ఆపాలని, సస్పెన్షలను ఎత్తివేసి చర్చల ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఈవోలు శంషాబాద్ లో సమావేశమై డిజిటల్ క్రాఫ్ సర్వే చేయబోమని, తగిన భద్రతను, సహాయకులను అందిస్తేనే అందుకు సిద్దమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏఈవో లపై చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని సృష్టించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రి మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో 12 రాష్ట్రాలను ఎంపిక చేశారు. అక్షాంశ, రేఖాంశాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రతి భూమికి సంబంధించిన చిత్రాలను తీయడం, పంటల ఆన్‌లైన్ డేటాబేస్ తయారు చేయడం డిజిటల్ క్రాప్ సర్వే ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో డిజిటల్ సర్వే నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వంవ్యవసాయ శాఖ ఏఈఓలను ఆదేశించింది.


Similar News