Gandhi Bhavan: గాంధీ భవన్‌లో కిసాన్ కాంగ్రెస్ సమీక్ష.. ఎమ్మెల్యేలకు కీలక సూచనలు

గాంధీ భవన్(Gandhi Bhavan)లో మంగళవారం కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం(Kisan Congress Review Meeting) నిర్వహించారు.

Update: 2024-10-22 14:49 GMT

దిశ, వెబ్ డెస్క్: గాంధీ భవన్(Gandhi Bhavan)లో మంగళవారం కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం(Kisan Congress Review Meeting) నిర్వహించారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌(Chairman Anvesh) అధ్యక్షతన ప్రారంభం అయిన ఈ సమావేశానికి.. రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి( chairman of Rythu Commission Kodanda Reddy,) హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథిగా టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC chief Mahesh Kumar Goud) పాల్గొన్నారు. ఈ సమావేశంలో.. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై.. ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని, దీనిని ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యకర్తలను, ముఖ్యమైన నాయకులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. అలాగే నియోజకవర్గాల్లోని ప్రధాన నేతలు అందరూ పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్ కమిటీలో కిసాన్ కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పిస్తామని.. కిసాన్‌ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా.. టి.పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్(TPCC chief Mahesh Kumar Goud) వారికి హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనంపై స్పందిస్తూ.. ఆయనతో ఫోన్ లో మాట్లాడానని, అనుచరుడిని హత్య చేయడంతో.. ఆవేదన చెంది పార్టీపై అసహనం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. 


Similar News