ఏ కూటమిలోనూ చేరం.. ఒంటరి పోరాటమే : Mayawati
తమ పార్టీ ఏ కూటమిలోనూ చేరదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : తమ పార్టీ ఏ కూటమిలోనూ చేరదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరితోనూ చేతుల కలపబోమని తేల్చి చెప్పారు. ‘‘ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడమనే ప్రసక్తే లేదు. ఎన్డీయే కానీ, కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమిలోని పార్టీలు కానీ పేద ప్రజలకు వ్యతిరేకం. కులతత్వం, మతతత్వం, క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలతో అవి నడుస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా బీఎస్పీ పోరాటం సాగిస్తుంది. దీనిపై మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దు’’ అని మాయావతి కోరారు. సమాజంలోని అణగారిన, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలను ఏకీకృతం చేస్తూ.. ముందుకు సాగుతామని చెప్పారు.