రామ్‌లీలా మైదానంలో రావణ దహనం.. ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Update: 2024-10-12 12:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కాగా.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కూడా ఘనంగా రావణ దహన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ముందుగా సీతారామలక్ష్మణుల వేషధారణలో ఉన్నవారికి రాష్ట్రపతి, ప్రధాని తిలకం దిద్దారు. అనంతరం రావణుడి విశాల విగ్రహానికి విల్లు ఎక్కు పెట్టి దహన కార్యక్రమం పూర్తి చేశారు. 


Similar News