లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ

Update: 2023-12-22 17:20 GMT

న్యూఢిల్లీ : హిందీ హార్ట్ ల్యాండ్ గా భావించే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ విజయం సాధించిన ఊపులో ఉన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే ప్రక్రియను బీజేపీ ప్రారంభించనుందని తెలుస్తోంది. ఈక్రమంలో తొలి జాబితాను జనవరి చివరి వారంలో రిలీజ్ చేయనుందని అంటున్నారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం తర్వాత అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే ప్రక్రియకు కమలదళం శ్రీకారం చుడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ కొత్త నినాదాన్ని సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. “కలలు కాదు, వాస్తవికతలో ఉంటాడు. అందుకే అందరూ మోడీని ఎన్నుకుంటారు” అనే నినాదాన్ని ఈ ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించనున్నట్లు సమాచారం.


Similar News