Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు- ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతి,20 మందికి గాయాలు

రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాష్ట్రం మైహర్(Maihar) జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది

Update: 2024-09-29 00:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాష్ట్రం మైహర్(Maihar) జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్(Prayagraj) నుంచి నాగ్‌పూర్‌(Nagpur)కు ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్(Nadan Dehat) సమీపంలోకి రాగానే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు.ఈ ఘటనలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి.ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని,వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని మైహర్ పోలీసు సూపరింటెండెంట్(Maihar SP) సుధీర్ అగర్వాల్(Sudhir Agrawal) తెలిపారు.ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.


Similar News