అలాంటి నీచుల్నీ అరెస్ట్ చేసి కొట్టాలి.. వారికి నరకంలో స్పెషల్ ప్లేస్ ఉందంటూ సంచలన పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు.

Update: 2024-07-08 14:45 GMT

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. కొంత మంది ఫేమస్ అయ్యేందుకు ఏదైనా చేస్తుంటే.. మరికొందరు మాత్రం వారి ఆనందం కోసం వీడియోస్ చేసుకుంటున్నారు. అలా వైరల్ అవుతున్న వీడియోస్‌పై కొంతమంది విచక్షణ కోల్పోయి వల్గర్‌గా కామెంట్స్ పెడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా.. పి హనుమంత్ అనే చానెల్‌లో ఓ తండ్రి కూతురి వీడియోపై జోక్స్ చేస్తూ చెత్త వాగుడు వాగారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. మరికొందరూ పిచ్చిపిచ్చి కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చైల్డ్ అబ్యూజ్ వీడియోలపై సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే.. టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు చైల్డ్ అబ్యూజ్ వీడియో, ఫోటోలపై జాగ్రతగా ఉండాలంటూ పేరెంట్స్‌ను వేడుకుంటూ ఓ నోట్ షేర్ చేశారు. దీనిపై తెలంగాన్ సీఎం, డిప్యూటీ సీఎం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు. దీనిపై చర్చ ఇంకా కొనసాగుతుంది. మంచు మనోజ్‌తో సహా అడవి శేష్, విశ్వక్ సేన్ ఇలా అందరూ స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రేణు దేశాయ్ కూడా ఈ వ్యవహారం‌పై ఫైర్ అయ్యింది.

‘ఇతరుల వీడియోలు, కంటెంట్‌ని ఉపయోగించి చెత్తగా మాట్లాడుతున్న ఈ భయంకరమైన వ్యక్తులను అరెస్టు చేసి లాకప్‌లో కొట్టాలి. అలాగే ఇలాంటి చెత్త మాటలకు సపోర్ట్ చేస్తూ వారికి రిప్లైలు ఇచ్చే వ్యక్తులను కూడా అరెస్టు చేయాలి. మెజారిటీ మనుషులు ఎల్లప్పుడూ భయంకరంగా ఉంటారు. అంతేకాకుండా వారి నిజమైన దుష్ట ముఖాలు సోషల్ మీడియా కారణంగానే బయటపడతాయి. వారికి సొంతంగా ఎలాంటి టాలెంట్ లేకపోయినా హాస్యం పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తులకు నరకంలో ప్రత్యేక స్థానం ఉంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


Similar News