రామోజీరావు వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది: మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత.. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త, మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు.

Update: 2024-06-08 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత.. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త, మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. మీడియా సంస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు మరణించడం ఎంతో బాధాకరణం. దీంతో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు రామోజీ రావు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికన.. ‘‘ఎప్పుడూ ముందుండే దూరదృష్టి గల రామోజీ రావు మరణించినందుకు చాలా బాధపడ్డాను. రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న అభిరుచికి నిదర్శనం. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ మహేష్ బాబు ట్విట్టర్ వేదికన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులువురు సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News