ఆ యంగ్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న నమ్రత.. ఫుల్ ఖుషిలో మహేశ్ బాబు ఫ్యాన్స్!

నమ్రతా శిరోద్కర్.. మమేశ్ బాబు ‘వంశీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-07-08 15:51 GMT

దిశ, సినిమా: నమ్రతా శిరోద్కర్.. మమేశ్ బాబు ‘వంశీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చిరంజీవి ‘అంజి’లో కూడా నటించి మెప్పించిన ఈమె.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే.. వంశీ మూవీ టైంలో మహేశ్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత.. హీరోతో పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే పలు బిజినెస్‌లో కూడా రాణిస్తుంది. అయితే.. ఈ బ్యూటీ మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తే బాగుండూ అనుకోని వారు లేరు. అలాగే.. నమత్రకు మాత్రం సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పింది. అలాగే రీఎంట్రీ ఇచ్చే చాన్స్ కూడా లేదని తెగేసి చెప్పేసింది ఈ అమ్మడు.

కానీ, తాజాగా మాత్రం నమత్ర రీఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సినిమా ఓకే చేసిన ఈ యంగ్ హీరో.. త్వరలోనే తెరపై కనిపించనున్నాడు. అయితే.. మోక్షజ్ఞ మూవీలో నమ్రత నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. నమత్ర ఎంట్రీపై మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. వదినమ్మ మళ్లీ రీఎంట్రీ ఇస్తుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Similar News